ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇతర సంస్థలు టికెట్ ధరలను అడ్డగోలుగా పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని కేంద్రం స్పష్టం చేసింది.