ఐపీఎల్ 2025 భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. MI ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (53), రచిన్ రవీంద్ర*(65) అర్థశతకాలతో రాణించారు. ముంబై బౌలర్లో విఘ్నేశ్ 3 వికెట్లు తీయగా.. విల్ జాక్స్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు.