భారత్‌లోకి ప్రవేశించే యత్నం.. చైనా మహిళ అరెస్ట్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను సశస్త్ర సీమాబల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సరైన వీసా, పాస్‌పోర్ట్ పత్రాలు లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమె వద్ద లభించిన స్లిప్‌ ఆధారంగా హువాజియా జీగా గుర్తించారు. ఆమె భారత్‌కు ఎందుకు వచ్చిందనే దానిపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్