ఐబొమ్మ రవి ఫైరసీ కేసులో సీఐడీ రంగప్రవేశం

ఐబొమ్మ రవి ఫైరసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలోకి తెలంగాణ సీఐడీ ప్రవేశించింది. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసుల దర్యాప్తు చేస్తున్న సీఐడీ, రవి కేసులోనూ అదే కోణంలో దర్యాప్తు చేయనుంది. నాలుగు బెట్టింగ్ యాప్‌లతో ప్రమోట్ చేసిన రవి. బెట్టింగ్ యాప్స్ నుంచి వందల కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది. సీసీఎస్‌తో పాటు రవి ఆర్థిక వివరాలను సీఐడీ సేకరిస్తోంది.

సంబంధిత పోస్ట్