TG: సీఎం రేవంత్ ప్రతిపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఐడీని అడ్డుపెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతి చేస్తున్నారని గవర్నర్కు నివేదించినట్లుగా తెలిపారు. ప్రజాసంపద దోపిడీని అడ్డుకోవాలని కోరామన్నారు. కుంభకోణాలపై రేవంత్కు లేఖ రాశామని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.