TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు.