అమెరికా రాయబారి సెర్జియోగోర్తో బుధవారం సీఎం రేవంత్ సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో విద్య, ఉపాధి, పెట్టుబడుల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ముఖ్యంగా, అమెరికాకు వెళ్లే రాష్ట్ర విద్యార్థులకు వీసాలు పెంచాలని, వీసా అపాయింట్మెంట్లు సకాలంలో జరిగేలా సహకరించాలని, వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని సీఎం కోరారు.