సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్రమంత్రి ఖట్టర్ను కలిసి మెట్రో రెండో దశకు ఆమోదం తెలపాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణకు డీపీఆర్ను సమర్పించింది. ఈ ఫేజ్లో ఏడు కారిడార్లు, 123 కి.మీ విస్తరణ, 86 స్టేషన్ల నిర్మాణం ప్రతిపాదించారు. దీనికి రూ.38,595 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.