TG: సీఎం రేవంత్ రెడ్డి నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండకు చేరుకున్నారు. ముందుగా ఊర్కొండ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం సీఎం తన తొలి ప్రయాణంలో తన వెంట నడిచిన నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. అనంతరం MBNR జిల్లాలోని మిడ్జిల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.