TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంగళవారం CLP సమావేశం జరిగింది. ఈ సమావేశంలో CM ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువంటూ తెలిపారు. ఎలా పడితే అలా మాట్లాడితే మంత్రి పదవులు కోరేవాళ్లకే నష్టమంటూ పేర్కొన్నారు. గురువారం నుంచి ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించాలని సూచించారు. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే మన టార్గెట్ అని చెప్పారు.