నేటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో సీఎం ప్రచారం నిర్వహించారు.