తెలంగాణ పర్యాటక శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తారామతి బారామతి, దుర్గంచెరువులను టూరిజం హబ్లుగా అభివృద్ధి చేయాలని, మంజీరా, దిల్కుషా గెస్ట్హౌస్లను ఆధునీకరించాలని ఆదేశించారు. వికారాబాద్ను టూరిజం హబ్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేయాలని, వీరభద్రస్వామి ఆలయానికి యాదాద్రి తరహా కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో కలిపి ఎకో టూరిజంగా, ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆదేశించారు.