TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గుములాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.