సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా 17 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించి.. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొననున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్