TG: కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా అందెశ్రీ పాడె మోశారు. ఈ మేరకు అందెశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు కూడా అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు.