తెలంగాణలో ఎటుచూసినా స్థానిక సంస్థల ఎన్నికల పైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సోమవారం ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందింది. దీంతో బుధవారం ఉదయం 11.30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు రాజకియంగా చర్చ జరుగుతోంది.