ఢిల్లీలోని ఒక గర్ల్స్ పీజీ హాస్టల్లో డ్రైనేజీ పైప్లైన్ తరచుగా జామ్ అవ్వడంతో.. శుభ్రం చేసే సమయంలో వందలాది ఉపయోగించిన కండోమ్లు, చెత్త బయటపడ్డాయి. అక్టోబర్ 27న జరిగిన ఈ సంఘటనతో సీవర్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. హాస్టల్ యాజమాన్యం, స్థానికులు ఈ దృశ్యాలతో షాక్కు గురయ్యారు. పోలీసులు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనతో హాస్టల్లో కఠిన పర్యవేక్షణ అవసరమని స్పష్టమైంది.