ఆపరేషన్ సిందూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భారత్-పాక్ కాల్పుల విరమణ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ‘జైహింద్’ పేరిట ఈ ర్యాలీలు జరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బుధవారం వెల్లడించారు.