హిందూ మహిళలను మోసపూరితంగా వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చే కుట్రను మధ్యప్రదేశ్ పోలీసులు బయటపెట్టారు. 'లవ్ జిహాద్' పేరుతో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తాజాగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇండోర్కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ కీలక పాత్ర పోషిస్తున్నాడని, యువకులను ‘లవ్ జిహాద్’లో పాల్గొనాలని ఆయన ప్రేరేపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖాద్రీపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కేసు నమోదు చేశారు.