కాంగ్రెస్‌ నేతలు నాపై దాడి చేశారు: MLC స్వతంత్ర అభ్యర్థి

కాంగ్రెస్‌ నేతలు తనపై దాడి చేశారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నార్కట్‌పల్లి కాంగ్రెస్‌ నేతలు డోకూరు పంక్షన్ హాలులో ఓటర్లకు డబ్బులు పంచు పంచుతున్నారని అశోక్‌ ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని, వీడియో తీస్తున్న సిబ్బందిపైన దాడి చేశారని, సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని అశోక్‌ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్