బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహాగఠ్బంధన్ అభ్యర్థులు 84 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ జన్సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. ఇక కాంగ్రెస్కు మళ్లీ నిరాశే ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 20 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.