కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల అపారెల్ పార్క్ను పరిశీలించిన ఆయన.. తమ హయాంలో వచ్చిన రెండు పరిశ్రమలు మినహా కొత్త పరిశ్రమలు రాలేదని, 25వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యం నెరవేరలేదని అన్నారు. సంక్రాంతి లోపు వర్కర్ టూ ఓనర్ పథకం లబ్ధిదారులను ప్రకటించకపోతే 10వేల మందితో నిరసన చేపడతామని హెచ్చరించారు.