గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని భారత్కు పాలస్తీనా విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ల మధ్య శాంతి ఒప్పందం జరగడంతో దాడులు ఆగిపోయాయి. ఈ క్రమంలో గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోడీకి భారత్లోని పాలస్తీనా దౌత్యాధికారి అబెద్ ఎల్రాజెగ్ అబు జాజెర్ విజ్ఞప్తి చేశారు.