అయోధ్యలో విరాళాల లెక్కింపు ప్రక్రియలో కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, విరాళాలు లెక్కించే సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులను ఉపయోగించడంపై పూర్తి నిషేధం విధించారు. టేబుళ్లు, కుర్చీలు కాకుండా నేలపై కూర్చుని విరాళాలను లెక్కించాలని ఆదేశించారు. అలాగే, సిబ్బంది జేబులు లేని డార్క్ బ్లూ యూనిఫామ్ ధరించాలని, డ్రెస్ కోడ్ను తప్పనిసరి చేశారు.