TG: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలో షెడ్డుపై క్రేన్లు కూలిన ఘటనలో చనిపోయిన 5 మంది కార్మికుల కుటుంబాలకు ఎన్సీసీ కంపెనీ పరిహారం ప్రకటించింది. బాధిత కుంటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఇచ్చేందుకు ముందుకువచ్చింది. కాగా నిన్న ఈదురుగాలులు, వర్షం రావడంతో కార్మికులు రేకుల షెడ్డులోకి వెళ్లారు. అదేసమయంలో క్రేన్లు వారిపై కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది.