ఒడిశాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మల్కానగిరి జిల్లా చిత్రకొండ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిని చదువుతున్న ఓ విద్యార్ధిని పాపకు జన్మనిచ్చింది. ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న బాలిక గర్భిణి అయినట్లు ఆమెకు తెలియదు. ఈ క్రమంలో ఇటీవల హాస్టల్లోనే ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా అధికారులు విచారణ జరుపుతున్నారు.