TG: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు వీరన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా బాధితురాలిపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని రక్షణ కేంద్రానికి తరలించి, వీరన్నపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.