ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించారు. రోహిత్ 41 బంతుల్లో 3 సిక్సర్, 5 ఫోర్లతో దూకుడుగా ఆడి 50 పరుగులు చేశారు. ఇది హిట్మ్యాన్కు 58వ ODI హాఫ్ సెంచరీ. మరొక ఎండ్లో శుభ్మన్ గిల్ 10 పరుగులతో నిలకడగా అడుగుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. దీంతో 10.1 ఓవర్లకు టీమిండియా స్కోర్ 65/0గా ఉంది.