పుణెలోని కరేగావ్లోని శివశక్తి స్వీట్ హోమ్ హోటల్లో దారుణ ఘటన జరిగింది. కేవలం వడాపావ్ ఆలస్యంగా వడ్డించాడనే చిన్న కారణంతో రాజు దేవాసి అనే కార్మికుడిపై కస్టమర్ ఈశ్వర్ నవ్లే క్రూరంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడితో కరేగావ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.