భారత్లో రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భారతీయులు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం చవిచూశారు. కేంద్ర హోంశాఖ ప్రకారం, ఈ మోసాల్లో సగం మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ల నుంచి నడుస్తున్న నెట్వర్క్లే కారణం. సైబర్ మోసాల వలన మన దేశం ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్లు నష్టపోతున్నదని ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల విశ్లేషణలో తేలింది.