ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావంతో గాజువాక యారాడలో కొండ చరియలు విరిగిపడ్డాయి. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. యారాడ నుండి గంగవరం వెళ్తున్న బస్సు కొద్దిసేపు నిలిచిపోయిన దృశ్యం కనిపించింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.