తెలంగాణలో పదోతరగతి ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తవడంతో ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ రిజల్ట్స్ను చూసుకోవచ్చు.