యూపీలోని బిజ్నోర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాంపూర్కు చెందిన మగ పెళ్లివారి కుటుంబం జార్ఖండ్కు చెందిన వధువుతో కలిసి తమ ఇంటికి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం కారు, ఓ టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వధూవరులతో సహా ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.