TG: అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నుండి కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు వెళ్లారు. భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలడంతో నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.