డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. జనసేన కార్యకర్తలతో వర్మ అభిమానులపై డీసీఎం పోలీసులకు ఫిర్యాదు చేయించారు. తమ విధులకు అడ్డం తగిలినట్టు ఓ ఏఎస్ఐ కూడా టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశాడు. దీంతో "గెలిపించిన పాపానికి మాపై కేసులు పెడతారా" అంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.