మధ్యప్రదేశ్లోని సత్నా జైలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ జైలర్ ఫిరోజా ఖాతూన్, గతంలో అదే జైలులో ఖైదీగా ఉన్న ధర్మేంద్ర సింగ్ను హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. 2007 నాటి హత్య కేసులో జీవిత ఖైదు పడిన ధర్మేంద్రపై, జైలులో పనిచేస్తున్నప్పుడే ఫిరోజాకు ఇష్టం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం హైకోర్టు ఆదేశాలతో ధర్మేంద్ర విడుదలయ్యాడు. అప్పటి నుండి వీరిద్దరూ సంప్రదింపులు జరుపుతూ, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.