కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా భారీగా తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు గరుడ సర్కిల్ వరకు బారులుతీరాయి. టోకెన్లు లేకపోయినా, కొత్త ఏడాదిలో తిరుమలలో గడపాలని భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు.