పంజాబ్లోని బఠిండాలో దారుణం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్ర ముగించుకుని వస్తున్న భక్తుల వాహనం అకస్మాత్తుగా ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అమర్నాథ్ యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.