TG: హైదరాబాద్లోని ఉప్పరపల్లిలో ఉన్న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం, పండ్లు, ఐస్క్రీమ్లను అధికారులు గుర్తించారు. పాడైన మాంసాన్ని ఫ్రిజ్లో నిల్వ చేసి వండుతున్నట్లు, ఎక్స్పైరీ అయిన వస్తువులకు కొత్త స్టిక్కర్లు వేసి వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. కిచెన్లో అపరిశుభ్రతపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమూనాలను ల్యాబ్కు పంపగా, అక్కడ తిన్న ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసింది.