యూరియాను అధికంగా వాడటం వల్ల పంటలు బలహీనమై, పురుగులు మరియు రోగాలకు గురవుతున్నాయి. నిపుణుల సూచన మేరకు యూరియాను తక్కువ మోతాదుల్లో పలుమార్లు వేయాలి. అలాగే, భాస్వరం, పొటాష్, సూక్ష్మపోషక ఎరువులు అవసరం. ఇవి ఖరీదుగా ఉండటంతో రైతులు దూరంగా ఉంటున్నారు. దీంతో భూమి నాశనమై, పంట దిగుబడి తగ్గుతోంది. పెట్టుబడి మేరకు లాభం రావడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.