ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఫోన్పే, గూగుల్ పేతో పాటు క్రెడిట్ కార్డు వాడకం కూడా భారీగా పెరిగింది. అయితే వీటిని జాగ్రత్తగా వాడకపోతే నష్టపోతారని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. "లిమిట్ పెంపు, రివార్డ్ క్లయిమ్" వంటి పేర్లతో వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దని, కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. క్రెడిట్ కార్డు అప్డేట్కి OTP అడగరు. అలా అడిగితే అది మోసమేనని చెప్పారు.