భారత్లో ఆకస్మిక మరణాలపై కేంద్రం అధ్యయనం చేపడుతుందనే వార్తలు వస్తుండటంతో PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. కేంద్రం ఇలాంటి ఏ అధ్యయనాన్ని కూడా నియమించలేదని, ఆకస్మిక మరణాలపై జరుగుతున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ న్యూస్లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని PIB హెచ్చరించింది.