దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 466 పాయింట్లు నష్టపోయి 84,636 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు క్షీణించి 25,806 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.14కి పడిపోయింది. హెచ్యూఎల్, భారతీ ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, టీసీఎస్, రిలయన్స్, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.