దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నాడు భారీ నష్టాలతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 533.50 పాయింట్ల నష్టంతో 84,679.86 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 91.04గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎటెర్నెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.