రాజకీయాలను క్రికెట్‌తో ముడిపెట్టొద్దు: కాంగ్రెస్‌ MP శశిథరూర్‌

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో రికార్డు ధర రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ స్పందిస్తూ.. ‘బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు, క్రికెట్‌కు ముడిపెట్టకూడదు. అయితే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని మేం వారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్