AP: సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోవడంతో అనంతపురం జిల్లాలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై చంద్రబాబు ఆరా తీశారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో నష్టపోయిన రైతులకు వెంటనే సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు.