పశ్చిమ బెంగాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ను అభివృద్ధి చేయాలన్న ఆలోచన టీఎంసీకి లేదని, గత 15 ఏళ్లలో టీఎంసీ నేతలు బెంగాల్కు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బెంగాల్లో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన సూచించారు.