బెంగళూరులో అనుమతి లేకుండా విద్యార్థిని వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది. ఆమెకు తెలియకుండానే తీసిన వీడియోను ఓ ఇన్స్టా ఖాతాలో పోస్టు చేయగా, దానికి అనుచితమైన మెసేజ్లు వస్తున్నాయని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ ప్రారంభించి గ్రూప్ అడ్మిన్ను అరెస్ట్ చేశారు. బాధిత యువతి న్యాయంగా పోరాడుతానని, అందరూ తనకు మద్దతు ఇవ్వాలంటూ నెటిజన్లను కోరింది.