లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, E20 పెట్రోల్ వాడకంతో 2023కి ముందు కొనుగోలు చేసిన వాహనాల్లో మైలేజ్ తగ్గుతోందని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది గత తొమ్మిది నెలల్లో తమ వాహనాల మైలేజ్ తగ్గిందని తెలిపారు. 29% మంది ఇంజిన్, ట్యాంక్, ఫ్యూయల్ లైన్లలో సమస్యలు ఎదుర్కొన్నట్లు నివేదించారు. అధికారులు మైలేజ్ డ్రాప్ 1-6% ఉంటుందని అంచనా వేస్తుండగా, వాహనదారులు వాస్తవంలో ఇది ఇంకా ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.