TG: బీఆర్ఎస్ నేతలతో కలిసి కొందరు అధికారులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఏసీబీ వెలికితీస్తోందని CM రేవంత్ అన్నారు. ఒక్కొక్కరు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అక్రమాలు, దోపిడీలు ఆగిపోతున్నాయనే భయంతోనే ప్రజా ప్రభుత్వం కూలిపోవాలని కొందరు కోరుకుంటున్నారని విమర్శించారు. అవినీతిపై ప్రభుత్వం రాజీపడబోదని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని సీఎం స్పష్టం చేశారు.